దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు.తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి పలువురు మంత్రులు, వైసీపీ నేతలు వైఎస్సార్కు నివాళులర్పించారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా అంతకముందు జగన్ ట్వీట్ చేశారు.తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ‘నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.