గత కొన్ని రోజులుగా నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. నెలరోజులు గడువుతో నిబంధనలు పాటించే అవకాశం ఇచ్చామని చెప్పారు. మంత్రి నాని స్వస్థలమైన మచిలీపట్నంలో మూతపడ్డ థియేటర్ ల యజమానులు కలిశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని స్పందిస్తూ.. థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో 9 జిల్లాల్లో సీజ్ అయిన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి.