: అయ్యన్నపాత్రుడు
లేని చట్టం పేరు చెప్పి.. ఉరి శిక్ష, జీవిత ఖైదు శిక్షలు వేశామంటూ.. హోంమంత్రి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లేని దిశ చట్టం కోసం రాజమండ్రిలో దిశ స్టేషన్ను ప్రారంభించారన్నారు. హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోడెల కూడా గతంలో హోం మంత్రిగా చేశారని.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. కోడెలను చూసే.. తన నియోజకవర్గంలో స్మశానాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కోడెల కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు.