హైదరాబాద్ : ట్రూకాలర్ తన ట్రూకాలర్ బిజినెస్ ఆఫర్లకు 500 వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ విజయాన్ని కేవలం కొన్ని నెలల వరుస ప్రయత్నాల నుంచి సాధించగా, బ్రాండ్లకు వారి వినియోగదారులకు ఉత్తమ విధానంలో అనుసంధానం అయ్యేందుకు మద్ధతు ఇచ్చే బృందాలతో సాధ్యమైంది. ఈ వ్యాపారాలు భారతదేశంతో కలిపి 25కు పైగా ఎక్కువ దేశాల్లో ఉండగా, వారి ప్రస్తుత వ్యాపారానికి విలువలను జోడిరచే పరిష్కరణలను అలవర్చుకున్నాయి. ఈ ఆఫర్ వ్యాపారాలకు వారి గుర్తును ట్రూకాలర్ ద్వారా గుర్తించేందుకు అవకాశం కల్పించడం ద్వారా వంచన, మోసపు కాల్స్ నుంచి రక్షించి వినియోగదారులకు సురక్షతను వృద్ధి చేస్తుంది.