Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆప్‌దే దిల్లీ మేయర్‌ పీఠం.. బీజేపీ ప్రయత్నాలు విఫలం

మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి షెల్లీ విజయం
దిల్లీ మేయర్‌ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్‌ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాది గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు రాగా.. షాలీమార్‌ భాగ్‌కు 116 ఓట్లు వచ్చాయి. మొత్తం 250 వార్డులున్న దిల్లీ మున్సిపాల్టీకి గతేడాది డిసెంబరులో ఎన్నికలు జరగ్గా.. ఆప్‌ 134 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఫలితాలు వెలువడి రెండు నెలలు గడిచినా మేయర్‌ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో బుధవారం ఓటింగ్‌ నిర్వహించారు. ఉదయం 11.30 నిమిషాలకు మున్సిపల్‌ హౌజ్‌లో సమావేశమైన కొత్తగా ఎన్నికైన కౌన్సెలర్లు.. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌, స్టాండిరగ్‌ కమిటీలోని ఆరుగురు సభ్యుల ఎన్నిక కోసం ఓటింగ్‌లో పాల్గొన్నారు. తొలుత దిల్లీ ఎంపీలు (లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు) తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ఓటు వేశారు. నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయరాదని, రాజ్యాంగంలోనూ స్పష్టంగా దీనిని పేర్కొన్నారని సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుచెప్పింది.దక్షిణ, తూర్పు, ఉత్తర దిల్లీలను విలీనం చేసిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ సత్తా చాటింది. దీంతో 15 ఏళ్ల తర్వాత దిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ పట్టుకోల్పోయింది. మొత్తం 250 వార్డులకు గానూ ఆప్‌ 134, బీజేపీ 104, కాంగ్రెస్‌ 9 చోట్ల విజయం సాధించాయి. తాజాగా, బుధవారం జరిగిన మేయర్‌ ఎన్నికకు మాత్రం కాంగ్రెస్‌ దూరంగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img