Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉగ్రవాదులకు సాయం చేసిన మాలిక్‌ను శిక్షిస్తే విమర్శలా..

ఓఐసీపై భారత్‌ ఆగ్రహం
ఉగ్రవాదులకు నిదులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవిత శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై ఇస్లామిక్‌ దేశాల కూటమి మానవహక్కుల విభాగం స్పందిస్తూ.. యాసిన్‌ మాలిక్‌ శిక్ష విషయంలో భారత్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని నోరు పారేసుకుంది. ఓఐసీ విమర్శలు గుప్పించడం పట్ల భారత్‌ తీవ్రంగా మండిపడిరది. ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ… మాలిక్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్‌కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘యాసిన్‌ మాలిక్‌ కేసులో తీర్పుపై భారత్‌ను విమర్శిసూ ఓఐసీ ఐపీమెచ్‌ఆర్‌సీ చేసిన విమర్శలు అ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్‌ మాలిక్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు ఓఐసీ ఐపీమెచ్‌ఆర్‌సీ పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్‌ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు, ఉగ్ర కార్యకలాపాలు సహకరించినట్టు నిర్ధారణ కావడంతో వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను దోషిగా నిర్దారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు బుధవారం ఆయనకు జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్‌ఐఏ మాత్రం ఆయనకు మరణ శిక్ష విధించాలని కోరింది. మాలిక్‌ మాత్రం తనపై వచ్చిన అభియోగాలను పైకోర్టులో సవాల్‌ చేయడం లేదని మాలిక్‌ కోర్టుకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img