ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఈ ఉదయం 11.50 గంటలకు అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే రేపు, ఎల్లుండి కూడా సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.