Friday, April 26, 2024
Friday, April 26, 2024

కరోనాపై దేశవ్యాప్తంగా హై అలర్ట్‌.. హాస్పిటళ్లలో మాక్‌ డ్రిల్‌..

గత కొంతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్‌ ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా మన దేశంలో కూడా కోవిడ్‌ కలవరం మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి హాస్పిటళ్లు అన్నీ ప్రిపేరవుతున్నాయి. దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ఈరోజు మాక్‌ డ్రిల్‌ను పర్యవేక్షించారు.అలాగే రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు తమ దగ్గర ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్‌ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్‌ పడకల లభ్యతను సమీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిపై దృష్టిసారించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img