గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది.మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం గాల్వాన్ లోయలో భారత్` చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సంతోష్ బాబు వీరమరణం పొందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్బాబు.. 16 బిహార్ రెజిమెంట్కు కమాండిరగ్ అధికారిగా వ్యవహరించారు. చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తొప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్బాబు సహా 21 మంది భారత సైనికులు వీర మరణం పొందారు.