దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,38,016కు చేరింది. ఇందులో 4,25,05,410 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో 26 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,21, 736 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1081 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 10,870 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.77 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,86,07,06,499 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.