Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,451 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 14,201 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 585 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు 3,42,15,653కి చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,35,97,339 కాగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,62,661గా ఉంది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 4,55,653కి చేరింది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. నిన్న ఒక్కరోజే 55,89,124 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. దీంతో మొత్తంగా 1,03,53,25,577 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img