బీహార్లో (జేడీయూ)తో కూడిన మహా కూటమి ప్రభుత్వ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కూటమిలో అత్యధిక సభ్యులు కలిగిఉన్న ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కాయి. నితీశ్ పార్టీ నుంచి 11 మంది ప్రమాణస్వీకారం చేయగా..కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి ఒకరు మంత్రివర్గంలో చేరారు. మొత్తంగా సుమారు 30 మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు కేబినేట్ లో చోటు ఉంటుందా.. ఉండదా అనే చర్చకు తెరదించుతూ.. నితీష్ మంత్రివర్గంలో బెర్తు ఖరారు అయ్యింది. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, అలోక్ మెహతా, రామానంద్ యాదవ్, సురేంద్రప్రసాద్ యాదవ్, లలిత్ కుమార్ యాదవ్, జేడీ(యూ) నుంచి విజయ్ చౌదరి, బిజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, శ్రవణ్ కుమార్, లేషి సింగ్ మదన్ సహాని, ఆఫాక్ ఆలంలు మంత్రులుగా ప్రమాణం చేశారు.