Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ రాజీనామా

నివురుగప్పిన నిప్పులా అసోసియేషన్‌
మోహన్‌బాబు బూతులు తిట్టారు : బెనర్జీ
ఇన్ని మాటలు పడి ఎందుకుండాలి : శ్రీకాంత్‌
నరేష్‌పై విచారణ చేపట్టండి : శివాజీ రాజా

హైదరాబాద్‌ : ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ కొద్ది రోజులు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల సందర్భంగా వినిపించిన మాటలివి. త్వరలో ‘మా’ కుటుంబం ముక్కలు కానుందా? ఎన్నికల ముగిసినా అభిప్రాయభేదాలు ఇంకా సద్దుమణగలేదా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ పరిణామాలు ఎంతవరకూ వెళతా యనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం ప్రకాశ్‌రాజ్‌ టీం విలేకరులతో మాట్లాడిరది. ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటిం చారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంత రాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని తెలిపారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.
అప్పుడే రాజీనామా వెనక్కి తీసుకుంటా..
‘నేను ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు స్వీకరించనన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువారు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో సభ్యుడిగా కొనసాగడం నాకు ఇష్టం లేదు’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. వేరే అసోసియేషన్‌ ఏర్పాటు ఏమీ లేదన్నారు.
పదవులు లేకపోయినా అండగా ఉంటాం: శ్రీకాంత్‌
పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. ‘ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానెల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం. పని బాగా జరగాలంటే అది ముఖ్యం. మెంబర్స్‌ ఉన్న వాళ్లలో అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి పనిచేయగలమా అనిపిం చింది. మా ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తామని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. నరేశ్‌గారు చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉన్నప్పుడు మేము ఏదైనా అంటే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. మా ప్యానెల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులు. మేం వెళ్లి ప్రశ్నిస్తే మళ్లీ గొడవలు అవుతాయి. పదవులు లేకపోయినా అందరికీ మేం అండగా ఉంటాం. మా అసోసియేషన్‌లో పరిణామాలపై చాలా సహిస్తూ వచ్చాను. నరేశ్‌ నన్ను అనేక మాటలు అన్నా భరించాను’ అని శ్రీకాంత్‌ అన్నారు.
మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారు : బెనర్జీ
ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ మాట్లాడుతూ, ‘‘నేను గెలిచిన తర్వాత నాకు అభినందనలు చెబుతున్నా, సంతోషంగా లేదు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబుగారు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబుకు వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం. వాళ్ల ఇంటికి వెళ్తే, మంచు లక్ష్మీని, విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి ‘సారీ అంకుల్‌ ఏమీ అనుకోవద్దు. మీరు కూడా ఏమీ అనొద్దు’ అని సముదాయించే ప్రయత్నం చేశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాదేసింది. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది’’ అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు.
మోహన్‌బాబు మాటలు జీర్ణించుకోలేకపోతున్నా: తనీశ్‌
‘గతంలో కూడా ఈసీ మెంబర్‌గా పనిచేశా. సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయి. నరేశ్‌ని పనిచేయనీయడం లేదని ఆయన చెప్పారు. మేం కేవలం ఈసీ మెంబర్స్‌. ఆయన చేసే పనులను మేము ఎక్కడ అడ్డుకుంటాం. ఓట్ల లెక్కింపు సందర్భంగా మోహన్‌ బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారు. ఆయన అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నా’’ అని తనీశ్‌ వాపోయారు.
బెనర్జీ ఏడవటం చూడలేదు: ఉత్తేజ్‌
‘‘నా భార్య పద్మ కన్నుమూయడంతో ఎన్నికల్లో యాక్టివ్‌గా లేను. కానీ, నాపై నమ్మకంతో ‘మా’ సభ్యులు నాకు ఓటేసి గెలిపించారు. వారందరికీ ధన్యవాదాలు.. బల్బు కనిపెట్టిన థామస్‌ ఆల్వా ఎడిసన్‌, సినిమాను ఇచ్చిన లూమియర్‌ బ్రదర్స్‌, ‘మాయాబజార్‌’ను గొప్పగా అందించిన మార్కస్‌ బాట్లేలకు సెల్యూట్‌. ఎందుకంటే వీళ్లు లోకల్‌ కాదు. సినిమా అన్న పదమే లోకల్‌కాదు. అలాంటిది ‘మా’ఎన్నికల్లో లోకల్‌, నాన్‌లోకల్‌ అన్న వివాదం తీసుకొచ్చారు. సినిమాను అమితంగా ప్రేమించే ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ కోసం ఏదైనా చేయాలని వస్తే,మేమంతా ఆయనతో కలిసి వచ్చాం. విష్ణు బ్రదర్‌ మీరు బాగా చేయగలరు. మీ వెనుక మీ నాన్నగారు ఉన్నారు. ‘మా’ సభ్యులను కాపాడే ప్రయత్నం చేయండి’’ అని ఉత్తేజ్‌ భావోద్వేగంతో మాట్లాడారు.
అందుకే ఓట్ల లెక్కింపు ఆపేశారు : ప్రభాకర్‌
‘మా’ ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కు మెజార్టీ వస్తుందనే ఆపేశారని బుల్లితెర నటుడు ప్రభాకర్‌ ఆరోపించారు. ‘‘ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా వేసిన తర్వాత అందరూ వెళ్లిపోయారు. నేను అక్కడే ఉన్నా. పోస్టల్‌ బ్యాలెట్‌లను ఎన్నికల అధికారి తీసుకెళ్లారు. ‘ఇక్కడ ఉంచండి’ అంటే ‘నాకు హక్కు ఉంది. తీసుకెళ్తున్నా’ అని అన్నారు. కొంతమందికి ఆయన భయపడ్డారు. ఎదురు మాట్లాడలేకపోయారు. చాలా అన్యాయంగా కౌంటింగ్‌ జరిగింది. ఇంటికి తీసుకెళ్లిన ఈసీ మెంబర్స్‌ ఓట్ల గురించి అడిగితే విష్ణు నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి చెబితే ‘శ్రీకాంత్‌ మీరు ఫిర్యాదు చేస్తే, ఎన్నికలు రద్దు అవుతాయి. వివాదం కోర్టుకు వెళ్తుంది. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు’ అన్నారు. అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని వదిలేశాం’’ అని ప్రభాకర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే… మరోవైపు ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేయకుండానే సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తన డిమాండ్‌ను విష్ణు ప్యానెల్‌ ముందుంచారు.
నరేశ్‌ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, తప్పులు జరిగినట్లు రుజువైతే 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాజా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపైనా అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఆదివారం అనసూయ విజయం సాధించినట్లు ప్రకటించి, సోమవారం ఓడిపోయినట్లు తెలిపారు. దీంతో ఆమె వ్యంగ్యంగా ఓ ట్వీట్‌ చేశారు. ఒకరిద్దరు సభ్యులు ఓడిపోయినట్లు ఆదివారం ప్రకటించగా, సోమవారం వారు గెలిచారంటూ వెల్లడిరచారు. దీంతో ‘మా’ ఓట్ల లెక్కింపుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు నచ్చిన, తమ మాట వింటారనుకునే వారిని గెలిపించినట్లు చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఓట్ల్లు రీకౌంటింగ్‌ చేయాలని ఎవరైనా డిమాండ్‌ చేస్తారా? లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img