దేశంలో కొత్తగా 41,806 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది బాధితులు కోలుకోగా, మరో 4,32,041 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి ఇప్పటివరకు 4,11,989 మంది మరణించారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు 39,130 మంది డిశ్చార్జీకాగా, 581 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 34,97,058 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 39,13,40,491కు చేరిందని తెలిపింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 43,80,11,958 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 19,43,488 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడిరచింది.