ఇస్లామాబాద్: పాకిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ 10వ మహాసభలు జూన్ 16 నుంచి 18వ తేదీ వరకు రాజధాని ఇస్లామాబాద్లో జరగనున్నాయి. ఈ మేరకు పార్టీ ప్రకటన పేర్కొంది. ఈ మహాసభల ద్వారా సంస్థాగత మార్పులు చేయాలని, పార్టీ మరింత బలోపేతం కావాలని, ఉద్యమాలను తీవ్రతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పాకిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన పేర్కొంది. మార్క్సిజం` లెనినిజం సిద్ధాంతాల మార్గదర్శకత్వంలో సోషలిస్టు పాకిస్తాన్ దిశగా మరింతగా కసరత్తు చేయాలని సంకల్పించింది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు రూపొందించుకోవాలని, సోషలిజం దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై దృష్టిని కేంద్రీకరించి తదనుగుణంగా పార్టీని ముందుకు నడిపించేలా కార్యాచరణను మహాసభ నిర్ణయిస్తుందని పేర్కొంది.