సావోపోలో : బ్రెజిల్ కమ్యూనిస్టు పార్టీ (పీసీబీ) 2022 అధ్యక్ష ఎన్నికలకు సోఫియా మంజానోను ముందస్తు అభ్యర్థిగా ప్రాథమికంగా ప్రకటించింది. సావోపోలో జన్మించిన సోఫియాకు ప్రస్తుతం 50 సంవత్సరాలు. ప్రఖ్యాత ఆర్థికవేత్త. ఆర్థిక శాస్త్రం, చరిత్రలో డాక్టరేట్ అయిన సోఫియా 17 సంవత్సరాల వయస్సు నుండి పీసీబీలో చురుకైన కార్యకర్తగా ఉన్నారు, సోఫియా మంజానో స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్వెస్ట్ బహియాలో ప్రొఫెసర్గా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చురుకుగా ఉన్నారు. పీసీబీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు అయిన సోఫియా కమ్యూనిస్ట్టు యూత్ యూనియన్ (యుజేసీ) అధ్యక్షురాలు. ఆమె పీసీబీ పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ విభాగానికి ఉపాధ్యక్షురాలు. ప్రొఫెసర్ సోఫియా అభ్యర్థిత్వం బ్రెజిలియన్ సంక్షోభానికి వామపక్ష ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది. సోఫియా మంజానో అభ్యర్థిత్వం బ్రెజిల్ పునర్నిర్మాణ కోణం నుండి సూచించే ప్రతిఘటన. 20 ఏళ్లలో బ్రెజిల్లో కొనుగోలు శక్తిలో అతిపెద్ద పతనం కాగా ద్రవ్యోల్బణం పెరుగుదల దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది.