విశాలాంధ్ర, పెద్దకడబూరు :పెద్దకడబూరు మండల నూతన ఈఓఆర్డి గా జనార్ధన్ సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టారు. ఆదోని మండల పరిషత్ కార్యాలయంలో ఈఓఆర్డి గా పనిచేస్తున్న జనార్ధన్ సాధారణ బదిలీలలో భాగంగా పెద్దకడబూరు మండలానికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఈఓఆర్డి గా పనిచేస్తున్న వెంకట రమణప్ప ప్రమోషన్ పై అనంతపురం జిల్లా గుంతకల్లు కు బదిలీపై వెళ్లారు. ఈ ఈఓఆర్డి జనార్ధన్ మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో మండలంలోని వివిధ గ్రామాలలో పారిశుధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.