నందవరం మండల గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేశాయ్ గురురాజరావు
విశాలాంధ్ర/నందవరం : రాబోయే తరాలకు యువత వారి భవిష్యత్తు చాలా అవసరం.. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దేశాయ్ నెట్వర్క్ అధినేత దేశాయ్ గురురాజరావు అన్నారు. శనివారం నందవరంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నూతన సంవత్సర వేడుకల్లో జరగరానిది ఏదైనా జరిగితే నిన్ను నమ్మిన తల్లి తండ్రులు,బంధువులు, మిత్రులకు అందరికి దూరమౌతారని, యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ వారు వారి వృత్తిలో భాగంగా మన కోసం డ్యూటీలో ఉంటారు.వాళ్ళ ఎదురుగా ఏదైనా జరిగితే కాపాడటం వారి బాధ్యత, అదే పత్రిక,మీడియా విలేఖరులు ఉంటే వార్త రాస్తారు అది వారి బాధ్యత.ఇక నీకు అన్ని చూసుకునే నీ తల్లి తండ్రులు, బందువులు మాత్రం నిన్ను చూస్తూ ఏడుస్తూ ఉంటారు..యువతాజాగ్రత్త..నీ జీవితంలో ఎన్నో నూతన సంవత్సర వేడుకలు రావాలని కోరుకుందాం.. అని 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.