విశాలాంధ్ర – ఆస్పరి : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ రూపొందించిన రైతు లోకం మాస పత్రిక, 2023 రైతు డైరీని సింగిల్ విండో చైర్మన్ కట్టెల గోవర్ధన్, సీఈఓ అశోక్ నాయుడు, ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నాగేంద్రయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఉరుకుందప్ప లు రైతులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ కట్టెల గోవర్ధన్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన సమాచారంతో రైతు లోకం మాసపత్రిక, డైరీని రూపొందించడం అభినందనీయమన్నారు. వ్యవసాయంలో సాంకేతిక విషయాలను రైతులకు అందిస్తూ రైతు లోకం వ్యవసాయ మాస పత్రిక ద్వారా రైతు సంఘం చేస్తున్న కృషి వల్ల రైతులకు ఉపయోగకరమని చెప్పారు. అనంతరం ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నాగేంద్రయ్య మాట్లాడుతూ రైతు సంఘం నిరంతరం రైతాంగ సమస్యలపై కృషి చేస్తోందన్నారు. అనేక రకాల పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువులకు ఖచ్చితమైన సమాచారంను రైతులకు మాసపత్రిక, రైతన్న డైరీలో ఉంటుందని కావున ప్రతి రైతు కూడా మాసపత్రికను రైతన్న డైరీ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు శంకర్, ఏపీ రైతు సంఘం నాయకులు రామాంజినేయులు, రంగస్వామి, చంద్రశేఖర్, మోట, తదితరులు పాల్గొన్నారు