Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా 4,194 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఐదు వేల లోపే నమోదవుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,194 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అవగా… 255 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 4,29,84,261కి చేరాయి.ఇందులో 4,24,26,328 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15,714 మంది మృతిచెందగా, 42,219 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 6,208 కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.10 శాతం మాత్రమేనని, 98.70 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.20 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక 1,79,72,00,515 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img