దేశంలో రుతుపవనాల ప్రభావం బలహీనపడుతున్న నేపథ్యంలో మరో నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆగస్టు 15 వరకు వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆగస్టు 12,13 తేదీల్లో అసోం, మేఘాలయల్లో భారీవర్షాలు కురవవచ్చునని అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆగస్టు 14వతేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.