: శబరిమల ఆలయ దేవస్థానం బోర్డు
శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయంలో కొవిడ్-19 ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వాన్ని కోరాలని ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించిందని బోర్డు ప్రెసిడెంట్ ఎన్ వాసు తెలిపారు. తాము వర్చువల్ క్యూ సిస్టమ్కు వ్యతిరేకం కాదని, అయితే స్లాట్లను బుక్ చేసుకోలేకపోతున్నామని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.రోజుకు 15 వేల మంది భక్తులను ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఎనిమిది రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో కేవలం 14 వేల మంది భక్తులు మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. రోజుకు కేవలం 20 శాతం స్లాట్లు మాత్రమే బుక్ అవుతున్నాయన్నారు.ఇదిలావుండగా, బోర్డు ఆర్థిక బలం క్షీణించడంతో ఇతర వనరులపై దృష్టి పెట్టవలసి వస్తోందన్నారు.ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వాన్ని కోరాలని బోర్డు నిర్ణయించిందన్నారు.