Monday, May 6, 2024
Monday, May 6, 2024

సిద్ధూ మూసేవాలా హత్య దురదృష్టకరం: కేజ్రీవాల్‌

న్యూదిల్లీ: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యను అత్యంత దురదృష్టకర సంఘటనగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయరాదని చెప్పారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఆదివారం మూసేవాలాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో మృతిచెందారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతను తగ్గించిన మరుసటిరోజే ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యకు గురికావడం నిజంగా దురదృష్టకరమని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీ రోహిణి ప్రాంతంలోని ఎస్‌టీపీని సందర్శించిన సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ… ‘నిందితులను పట్టుకోడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఇప్పటికే పంజాబ్‌ సీఎం చెప్పారు…నిందితులను త్వరలో అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తాం’ అని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img