Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్‌

విశాలాంధ్ర బ్యూరో `నెల్లూరు: పిఎస్‌ ఎల్‌ వి సి 54 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించినది. అనుకున్న సమయానికి నింగిలోకి రాకెట్‌ ప్రవేశించిందినీ ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు.నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్‌నీశనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లా అయినటువంటి శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్లోని ఒకటో నెంబర్‌ లంచ్‌ ప్యాడ్‌ పిఎస్‌ఎల్‌ వి సి -54 రాకెట్‌ విజయవంతంగాప్రయోగించబడినది. ఇందులో మన దేశానికి చెందిన 1117 కిలోల బరువు గల ఓషన్‌ శాట్‌-3 (ఈవోఎస్‌-06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి పంపడం జరిగింది . ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శుక్రవారం 10.26 గంటలకు ప్రారంభమైంది.కౌంట్‌డౌన్‌ కొనసాగాక మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్‌ నింగిలోకి ఎగురవేయడం జరిగింది. చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ భూటాన్‌ దేశానికి చెందిన ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో ఉండడంతో ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగ సమయంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కడలిపై అధ్యయనానికి ఇస్రో ఓషన్‌ శాట్‌-3 ఉపగ్రహం ఎంతో దోహదపడుతుందని శర్మ సోమనాథ్‌ తెలిపారు. ప్రయోగం విజయమైన విజయవంతమైన తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ పిఎస్‌ఎల్విసి`54 రాకెట్‌ లో కొన్ని డిజైన్లు మార్పు చేయడం వలన వివిధ కక్షలోకి 8 ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలిగామని అందువల్లనే ఈ ప్రయోగం రెండు గంటల సమయంలో 8 ఉపగ్రహాలను వివిధ కక్షలలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగామని ఆయన అన్నారు. అలాగే గగన్‌ యాన్‌ ప్రయోగించే దానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు , పరిశోధనలు చేయడం జరుగుతుందని భవిష్యత్తులో గగన్యాన్ని విజయవంతంగా పక్షులకి ప్రవేశ పెట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుందని సోమనాథ్‌ తెలిపారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర్‌ పట్టణంలో చిన్నచిన్న రాకెట్లను ఉపయోగించేందుకు అవసరమైనటువంటి లంచ్‌ ప్యాడ్‌ ని నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఇప్పటికే ఆ ప్రాంతంలో భూసేకరణ కార్యక్రమం పూర్తయిందని రెండు సంవత్సరముల లోపల లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు ఇస్రో సిద్ధంగాఉందనిఆయనతెలిపారు. నావిగేషన్‌ వ్యవస్థ ద్వారా భారతదేశ ప్రజలకు త్వరలో అన్ని సౌకర్యాలతో అందిస్తామని గతంలో ఈ నావిగేషన్‌ సంబంధించి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగినది అయితే అవి కొన్ని విఫలమైన అందువలన ప్రస్తుతం ఈ నావిగేషన్‌ వ్యవస్థను కేవలం కొన్ని కీలకమైన రంగాలకు మాత్రమే ఉపయోగించడం జరుగుతున్నదని భవిష్యత్తులో మరో ఐదు ఉపగ్రహాలను ప్రయోగించి తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే విధంగా నావిగేషన్‌ సిస్టం ఇస్తామని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం జి ఎస్‌ ఎల్‌ వి మార్క్‌ 3 ద్వారా ఆర్య ఎల్‌ వన్‌ తోపాటు 36 ఉపగ్రహాలను కలిపి ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img