Monday, May 6, 2024
Monday, May 6, 2024

వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర, పార్వతీపురం: వైఎస్ఆర్సీపీ పార్వతీపురం ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు బుదవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10గంటల3నిమిషాలకు ముహుర్త సమయానికి పట్టణంలోని శ్రీవినాయక గుడిలో నామినేషన్ నింపి సంతకాన్ని చేశారు. అక్కడనుండి అరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టరు తనూజారాణి, నియోజక వర్గంలోని ప్రజాప్రతినిదులు, నాయకులు,కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి పాత బస్ స్టాండ్ నుండి పురవీధుల గుండా నామినేషన్ కేంద్రానికి భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన పార్వతీపురం ఆర్డీఓ కె.హేమలతకు అందజేసారు.ఈకార్యక్రమంలో మాజీ జడ్పీచైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, రాష్ట్ర దాసరి కార్పోరేషన్ ఛైర్మన్ రంగుముద్రి రమాదేవి,పురపాలక మాజీ వైస్ చైర్మన్ జయబాబు, బలిజిపేట జెడ్పీటీసీ అలజింగి, రవి కుమార్,మున్సిపల్ చైర్మన్ గౌరీశ్వరి, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ డమ్మీ అభ్యర్ధిగా అలజింగి రవికుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని ఆర్ ఓ హేమలత తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img