లార్డ్స్ టెస్టులో ఓటమిపై ఇగ్లాండ్ కెప్టెన్ రూట్
లార్డ్స్ : భారత్తో జరిగిన రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఇంగ్లాండ్ సారథి జో రూట్ వాపోయాడు. టీమిండియా లోయర్ ఆర్డర్ను తక్కువ అంచనా వేశామని అంగీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా (34), మహ్మద్ షమి (56) అద్భుత బ్యాటింగ్తో తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు. లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో ఓటమిపై రూట్ స్పందిస్తూ.. ‘‘కెప్టెన్గా నేను పొరపాట్లు చేశా.. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది.. షమి, బుమ్రా భాగస్వామ్యం మ్యాచులో కీలకమనడంలో సందేహం లేదు.. వారిని నేను అడ్డుకోలేకపోయా.. దాంతో మా జట్టు కష్టాల్లో పడిరది.. మేం తొలి ఇన్నింగ్స్లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్లో ఆడనందుకు నిరాశపడుతున్నా.. లోయర్ ఆర్డర్ డిఫెన్స్ను అంచనా వేయడంలో పొరపడ్డా’’ అన్నాడు.
షమి, బుమ్రాపై ప్రయోగించిన షార్ట్ బంతుల వ్యూహం విఫలమైందని రూట్ తెలిపాడు. ‘‘నిజానికి మేం స్టంప్స్కు నేరుగా దాడి చేస్తూ షార్ట్ పిచ్ బంతులతో ఆశ్చర్యపరిస్తే బాగుండేదేమో! ఏదేమైనా వారిద్దరికీ ఘనత ఇవ్వాల్సిందే. వారు భిన్నమైన ప్రాంతాల్లో కి షాట్లు ఆడటంతో ఫీల్డర్లను సరిగ్గా మోహరించలేకపోయా. ఇక ముందు మేం మరిన్ని వ్యూహాలతో వచ్చి వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం’’ అని పేర్కొన్నాడు. టీమిండియా దూకుడు ప్రదర్శించడంలో తప్పేమీ లేదని రూట్ స్పష్టం చేశాడు. ‘‘విరాట్ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడు. అతడితో పోలిస్తే నాది భిన్నమైన ఆటతీరు. విరాట్సేన నిజాయతీగానే ఆడిరది. వారు ఎక్కువ భావోద్వేగం చెందారు. వ్యూహాత్మకంగా రాణించారు. అవకాశాలను టీమిండియా ఒడిసిపట్టింది. నాకు తెలిసినంత వరకు మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలేమీ జరగలేదు. విద్వేషం ప్రదర్శించలేదు’’ అని రూట్ పేర్కొన్నాడు.