దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ప్రపంచకప్లో మూడు అర్ధశతకాలు సాధించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టాప్లోకి దూసుకెళ్లాడు. 834 రేటింగ్తో తొలి స్థానం ఆక్రమించాడు. 2018లో తొలిసారి మొదటి స్థానం సాధించిన బాబర్.. ఇప్పుడు మళ్లీ అదే ప్లేస్లోకి రావడం విశేషం. ప్రస్తుతం వన్డేల్లోనూ బాబర్ అజామ్దే ఫస్ట్ ర్యాంక్. టీ20ల్లో రెండో స్థానం డేవిడ్ మలన్ (798), మూడులో ఆరోన్ ఫించ్ (733), నాలుగైదు స్థానాల్లో మహమ్మద్ రిజ్వాన్ (731), విరాట్ కోహ్లీ (714) నిలిచారు. టాప్-10లో భారత్ నుంచి టీమ్ఇండియా కోహ్లీ (5వ స్థానం), కేఎల్ రాహుల్ (8వ స్థానం) సంపాదించారు. గతవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ వీరిద్దరివి ఇవే ర్యాంకులు. మరోవైపు శ్రీలంకపై అద్భుత శతకం బాదిన జోస్ బట్లర్ (670) ఎనిమిది ర్యాంకులను మెరుగుపరుచుకుని టాప్-10లోకి వచ్చేశాడు.