టీంఇండియా మాజీ కెప్టెన్ అజారుద్ధీన్ను పరామర్శించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు. అజారుద్ధీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్ధీన్ ఇటివలే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అజారుద్ధీన్ ను వారి ఇంటికి వద్ద కలిసి పితృవియోగ బాధ నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం అజారుద్ధీన్ కాంగ్రెస్లో కీలకమైన మైనారిటీ నేతగా ఉన్నారు. మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2000వ సంవత్సరంలో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డరని బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.