కాంగ్రెస్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ను ఏం చేయలేరని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. పాలకులు యువతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.. మోదీకి కుటుంబ, పిల్లలు లేరు.. ఆయనకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు.