11 గంటల వరకు 19.54 శాతం పోలింగ్ నమోదు
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.54 శాతం పోలింగ్ నమోదైంది. 137 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్ర్రక్రియ కొనసాగనుంది. మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 29,720 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.