Friday, April 26, 2024
Friday, April 26, 2024

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి డబ్బు దోచుకున్న దుండగులు

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు నామా పృథ్వి తేజను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన నిన్న రాత్రి ఆయన వ్యక్తిగత సిబ్బంది హైదరాబాద్‌ పంజాగుట్ట పీఎస్‌ లో ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద ఇద్దరు దుండగులు ఫృథ్వి వాహనాన్ని ఆపి ఎక్కారు. టోలిచౌకి నుంచి పంజాగుట్ట వరకు వాహనంలోనే తిరిగారు. అనంతరం దుండగులు… ఆయనను కత్తితో బెదిరించి రూ. 75 వేలు దోచుకున్నారు. దీనిపై ఫృథ్వి ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img