Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఠాగుర్‌ సినిమా రిపీట్‌… గర్భిణి మృతదేహానికి చికిత్స చేసిన వైద్యులు..

మెగాస్టార్‌ నటించిన ‘ఠాగూర్‌’ సినిమా ‘ఠాగూర్‌’ సినిమా గుర్తుందా.. అందులో చనిపోయిన వ్యక్తి బ్రతికున్నట్లు నాటకమాడి ఓ కార్పోరేట్‌ ఆస్పత్రి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుంది. తీరా ఫీజు చెల్లించాక ఆయన చనిపోయాడని తీరిగ్గా చెబుతారు.. సరిగ్గా అలాంటి సీనే తెలంగాణలో జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చేసిన సర్జరీ వికటించి గర్భిణి మృతిచెందింది. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పని ఆస్పత్రి యాజమాన్యం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పి మెరుగైన వైద్యం కోసం మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిందని కుటుంబ సభ్యుల్ని నమ్మించారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ పట్టణంలో ఆదివారం రాత్రి జరగ్గా బుధవారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందుతోందని.. క్రమంగా కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు. కొద్దిసేపటి చికిత్స విఫలమైన ఆమె చనిపోయిందని చెప్పారు. దీంతో అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆస్పత్రి యాజమాన్యం ఆడిన నాటకం బయటపడిరది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీస్‌ కేసు పెడతామని హెచ్చరించడంతో ఆస్పత్రి యాజమాన్య కాళ్ల బేరానికి వచ్చింది. తాము చేసిన తప్పునకు పరిహారంగా రూ.8లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఒప్పంద పత్ర రాసిచ్చారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img