Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

నవంబర్‌ 15న తెలంగాణ విజయ గర్జన : మంత్రి కేటీఆర్‌

పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్‌ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.. తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్‌ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాలన్నారు. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్‌ 27న నిర్వహించడం జరుగుతుంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించనున్నాం అని కేటీఆర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img