Friday, April 26, 2024
Friday, April 26, 2024

పరువునష్టం దావా కేసులో తీర్పు రిజర్వ్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టులో విచారణ జరిగింది. పరువునష్టం దావాలో ఇంజెక్షన్‌ ఆర్డరుపై వాదనలు ముగిసాయి. వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్‌ కోర్టును కోరారు. అయితే అయితే మధ్యంతర ఉత్తర్వులను సిటీ సివిల్‌ కోర్టు రిజర్వ్‌ చేసింది.మాదక ద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషనర్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img