Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాతబస్తీలో పేలుడు..ఇద్దరు మృతి

పాతబస్తీలోని ఛత్రినాకలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కందికల్‌ గేట్‌ వద్ద ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో విగ్రహాలు తయారు చేసే పరిశ్రమలో పటాకులు కాల్చడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుగల కారణాలను గుర్తించడానికి క్లూస్‌ టీమ్‌ను రప్పించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, విగ్రహ తయారీ పరిశ్రమలో పటాకుల కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పటాకులకు కెమికల్స్‌ తోడవడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని వెల్లడిరచారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img