Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలి

గవర్నర్‌ తమిళిసై
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జూబ్లిహిల్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కొవిడ్‌ రహితంగా తయారవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వందశాతం వ్యాక్సినేషన్‌ మొదటి డోస్‌ పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img