Monday, May 6, 2024
Monday, May 6, 2024

యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తాయ్‌..: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌

యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కిచ్చేస్తామన్నారు. డబ్బులు సంపాదన కోసమే దేశ వ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎంతో బీజేపీ దోస్తీ అనేది.. కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. ఎంఐఎం తమకు రాజకీయ శత్రువని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పనైపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిగా ఖతం అవుతుందని వ్యాఖ్యానించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల రాజా సింగ్‌ సంతోషం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img