Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై రజత్‌కుమార్‌ సమీక్ష

గులాబ్‌ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్‌ ఇంజినీర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖలోని ఇబ్బందులను పరిష్కరించేందుకు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులుంటే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040-23390794లో సంప్రదించాలని సూచించారు. వానలకు దెబ్బతిన్న చెరువుల పరిస్థితులపై ప్రత్యేక బృందాలు అధ్యయనం చేయనుండగా.. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img