పెండిరగ్ చలాన్లపై రాయితీ…
తెలంగాణలో వాహనదారులకు త్వరలో గుడ్న్యూస్ను అందనుంది. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ`చలాన్లు అందుకుంటూ వాటిని భారంగా భావించి జరిమానాలు చెల్లించకుండా వదిలేసిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఊరట కల్పించనున్నారు. పెండిరగ్లో ఉన్న చలాన్లు కట్టేందుకు వీలుగా రాయితీలు ఇవ్వనున్నారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో పెండిరగ్ ట్రాఫిక్ చలానాలపై అధికారులు దృష్టి సారించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, బస్సులపై ఉన్న పెండిరగ్ చలాన్లు రాయితీపై చెల్లించే అవకాశం కల్పిస్తూ అధికారులు దస్త్రం సిద్ధం చేశారు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం రాయితీ ఇచ్చి ఆన్లైన్, మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించేందుకు అనుమతిస్తారని తెలుస్తోంది.అయితే ఎంత మొత్తం రాయితీ ఇస్తారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.