Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇప్పటివరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్‌కు…

ఆపరేషన్‌ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. విడుతల వారీగా దిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌కు విమానాల్లో విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. ఇంకా ఉక్రెయిన్‌లో 350 మంది వరకు తెలంగాణ విద్యార్థులు ఉండొచ్చని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పేర్కొన్నారు.ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల్లో ఉన్న భారత ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను భారత్‌ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, హిందన్‌ ఎయిర్‌ బేస్‌ రెండు ప్రాంతాల్లో తెలంగాణ అధికారుల బృందాలు విద్యార్థులును రిసీవ్‌ చేసుకుంటున్నారని చెప్పారు. విద్యార్థులకు కావాల్సిన వైద్య, వసతి, ఆహార, రవాణా సదుపాయాలు కల్పిస్తూ వారి స్వస్థలాలకు పంపుతున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img