రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.2022 కొత్త సంవత్సరంలో కూడా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలనను కొనసాగిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీఎం తెలిపారు. 2022 కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.