స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. గోల్కొండ కోటను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.పోలీసుశాఖ, జీహెచ్ఎంసి, ఆర్అండ్బి, ఐ అండ్ పీఆర్, కల్చరల్, రెవెన్యూ శాఖలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.