Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పెట్టుబడులకు ఒకే ఒక్క గమ్యస్థానం హైదరాబాద్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని అన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతోపాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు జాన్సన్‌ కంట్రోల్‌ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. స్థానికంగా పెట్టుబడులు, తయారీ యూనిట్లు పెట్టే వారి కోసం ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకొచ్చామన్నారు. భారత్‌లో టాలెంట్‌ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. పెట్టుబడులకు ఒకేఒక్క గమ్యస్థానం హైదరాబాద్‌ అని, ఇకపై దేశంలోని ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జాన్సన్‌ కంట్రోల్‌ సంస్థ దశాబ్ద కాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నదని, హైదరాబాద్‌ ఎంతలా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీ-హబ్‌, టీ-సెల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. ఇమేజ్‌ టవర్స్‌, ప్రపంచ స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి హైదరాబాద్‌ అడ్డాగా మారబోతున్నదని వెల్లడిరచారు. ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img