పోడు భూముల సమస్యపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, అజయ్ కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడటంపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు.