ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజైన బుధవారం అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.15వ తేదీన విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి.