: ప్రవీణ్కుమార్
రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఇపుడు మార్చాల్సింది మహనీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదని, వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ లాంటి నాయకులని’ అని ట్వీట్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలని పేర్కొన్నారు.