ఈ నెంబరుకు కాల్ చేస్తే బస్సు పంపుతాం: సజ్జనార్
మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని చెప్పారు. గత ఏడాది 19లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామన్నారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని తెలిపారు. గత ఏడాది 30 కోట్ల రెవెన్యూ వచ్చిందని తెలిపారు. ఈసారి 3,845 బస్సులు నడపాలని- 51 పాయింట్స్ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్రతో పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నామన్నారు. 30మంది ప్రయాణికులు ఉంటే ఈ నంబర్ 04030102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ప్రజలందరూ తమ వెబ్ సైట్ను చూస్తే అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ 5వందల బస్సులు 12వందల ప్రయాణికులను మేడారం చేర్చామని తెలిపారు.