మంత్రి సబితా రెడ్డి
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో మాత్రమే ఉందని చెప్పారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి ప్రలందరిని కాపాడాలని వేడుకుందామని, అందరికి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.