Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్రంలో 19 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ


రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోలో పోస్టింగ్‌ కోసం వెయింగ్‌లో ఉన్న జి. హనుమంతరావును కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ట్రాఫిక్‌ ఏసీపీగా ఉన్న ఏ.చంద్రశేఖర్‌ను కూకట్‌పల్లి ఏసీపీగా నియమించారు. అలాగే కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న బీ సురేందర్‌రావును సైబరాబాద్‌ ఏసీపీ, ఎస్‌బీగా నియమించారు. ఇబ్రహింపట్నం ఏసీపీగా ఉన్న వై యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్‌లో, జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పీ వెంకటరణ, చౌటుప్పల్‌ ఏసీపీగా ఉన్న పీ సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఏ యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అలాగే ఏ. అనిల్‌ కుమార్‌- కాగజ్‌నగర్‌ ఎస్డీపీఓగా, బాల కృష్ణా రెడ్డి- ఇబ్రహింపట్నం ఏసీపీగా, మాదాత రమేష్‌- గజ్వేల్‌ ఏసీపీగా, ఆర్‌ శ్రీనివాస్‌- ఆసిఫాబాద్‌ ఎస్డీపీఓగా, రత్నాపురం ప్రకాశ్‌- జగిత్యాల ఎస్డీపీఓ, ఆర్‌ సతీశ్‌ కుమార్‌- గోషామహల్‌ ఏసీపీగా,ఎన్‌ ఉదయ్‌ రెడ్డి- చౌటుప్పల్‌ ఏసీపీగా, సాయి రెడ్డి వెంకట్‌ రెడ్డి- భువనగిరి ఏసీపీగా, వాసాల సత్తయ్య- హుస్నాబాద్‌ ఏసీపీగా, ఎన్సీ రంగస్వామి- గద్వాల్‌ డీఎస్పీగా,కే సైదులు- మెదక్‌ ఎస్డీపీఓగా ప్రభుత్వం నియమించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img