రెండవ రోజూ నాగార్జునసాగర్లో కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృంద సభ్యుల పర్యటన సాగింది. రెండురోజుల పర్యటనలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను ఈ బృంద సభ్యులు అధ్యయనం చేశారు. ఇవాళ నాగార్జునసాగర్ డ్యాం, ఎడమ కాలువ, గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, డైవర్స్ టన్నల్, రైట్ కెనాల్ గేట్లు పరిశీలించారు.అనంతరం హెల్ కాలనీ ఎస్సీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ డ్యాం ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన అంశాలతో ముసాయిదాను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. బృంద సభ్యుల్లో బీఆర్కే పిల్లే, బి రాయపూర్ ,ఆర్ టి కె శివరాజన్, అనుపమ్ ప్రసాద్ ప్రసాద్, మానాతంగ్, కోటేశ్వరరావు డి ఎస్ ప్రసాద్ శ్రీధర్ దేశ్పాండే, అశోక్ కుమార్, రఘునందన్ రావు, శ్రీనాథుడు రమేష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. బృంద సభ్యులకు ఎన్ఎస్పీఎస్ఈ ధర్మ నాయక్, ఈఈ యలమందయ్య ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలను వివరించారు.